Thursday, November 4, 2010

నీవస్తున్నావని
నేకలగని
హేమంతంలో..
ఓ నిశీధిలో...
నే హిమబింధువునై రాలితి
ఓ గడ్డిపొచపై.
నిన్ను ప్రశంసిస్తూ
నీపై గెయాల్ని అల్లుతూ
ప్రకృతి గానంతో
నా గళాన్ని కలిపి
గొంతుబొంగురుపొయెవరకు
పాడిపాడి
నీకై నిరీక్షించితి.
నీరాకకై తపించితి.
పక్షులు నిద్రలేచె.
భానుడు ఉదయించె.
అస్తమించె.
నీ రాకకై వేచి వేచి
నే ఆవిరైపోతి
నీవెక్కడ?
తల్లిలేని పిల్లలగని
హృదయం ద్రవించి 
తల్లివై ఆదరిస్తున్నవేమో!
ఆకలిగొన్న పేదవాల్ల
ఆకలితీర్చడానికి
అన్నమయ్యావేమో!   

No comments:

Post a Comment